Laptop thieves arrested : ల్యాప్ట్యాప్స్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్

by Sridhar Babu |
Laptop thieves arrested : ల్యాప్ట్యాప్స్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్
X

దిశ,మీర్ పేట్ : బాయ్స్ హాస్టల్స్, విద్యాసంస్థల్లో వరుస ల్యాప్ట్యాప్స్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను శుక్రవారం మీర్ పేట్ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుల వద్ద నుండి 6 లక్షల విలువ చేసే 13 ల్యాప్ట్యాప్స్ , ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన పాట మహేష్ (24), తిక్క లింగయ్య (23 మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ చింతల్ లో నివాసం ఉంటున్నారు. వీరు చెడు అలవాట్లకు బానిసలై చోరీలకు పాల్పడాలని పథకం వేశారు. ఈ నెల 17న స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ నగర్ లోని బాలాజీ బాలుర వసతి గృహంలో నివాసముండే అక్కి సిద్దార్థ్ గౌడ్ తన స్నేహితుడు కార్తీక్ తో కలిసి హాస్టల్ గదిలో

ల్యాప్ట్యాప్స్ పెట్టి బయటికి వెళ్లి వచ్చేసరికి ల్యాప్ట్యాప్స్ కనిపించకపోవడంతో ఈనెల 25న మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసుకొని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ల్యాప్ట్యాప్స్, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు. నిందితులు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడ్డారని పోలీసులు పేర్కొన్నారు. రెండు రోజుల్లో నే నిందితులను పట్టుకున్న మీర్ పేట్ ఇన్స్పెక్టర్ నాగరాజు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గౌరి నాయుడుతో పాటు క్రైమ్ సిబ్బందిని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి అభినందించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.



Next Story