విషాదం..నీటి సంపులో పడి బాలుడు మృతి

by Aamani |
విషాదం..నీటి సంపులో పడి బాలుడు మృతి
X

దిశ, పెద్ద వంగర : మండలంలోని చిట్యాల గ్రామంలో తన్నీరు వేణు రమా లకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు బడికి వెళ్లగా చిన్న కుమారుడు మాన్విత్ ఇంటి ముందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందాడు. కళ్ల ముందే ఆడుకుంటున్న తన కన్న కొడుకు క్షణాల వ్యవధిలో నీటి సంపులో పడి చనిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తండ్రి తన్నీరు వేణు ఫిర్యాదు మేరకు ఏఎస్సై విజయరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed