కాంట్రాక్టర్స్ కాలనీలో దొంగల బీభత్సం

by Disha Web Desk 15 |
కాంట్రాక్టర్స్ కాలనీలో దొంగల బీభత్సం
X

దిశ, పాల్వంచ టౌన్ : పాల్వంచ కాంట్రాక్టర్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కాంట్రాక్టర్స్ కాలనీకి ఉదయ్ కుమార్ ఆయన భార్య మమత కేటీపీఎస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఏడిగా పనిచేస్తున్నారు. వారు ఎండాకాలం సెలవుల నిమిత్తం ఇంటికి తాళాలు వేసి కుటుంబం మొత్తం మైసూర్ వెళ్లారు. అదునుగా భావించిన దొంగలు తాళాలు వేసి ఉన్న ఇంట్లో మెయిన్ డోర్ పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. బుధవారం ఉదయం పనిమనిషి ఇంటి మెయిన్ డోర్ తాళాలు

పగలగొట్టి ఉండటాన్ని గమనించి వెంటనే స్థానికులకు తెలియపరచడంతో స్థానికులు ఇంటి యజమానికి తెలియపరిచారు. వారు అక్కడి నుంచి రావడానికి రిజర్వేషన్లు లేక మణుగూరులో ఉంటున్న ఉదయ్ కుమార్ తండ్రికి సమాచారం ఇవ్వడంతో ఆయన సంఘటన స్థలానికి చేరుకొని 14 తులాల బంగారం చోరీ జరిగిందని గుర్తించారు. వెంటనే ఉదయ్ కుమార్ తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించి క్ల్యూస్​ టీం రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే తరహాలో అదే రోజు అర్ధరాత్రి బోర్వెల్ వెంకటేశ్వర్ ఇంట్లో కూడా దొంగతనం జరిగినట్టు స్థానికులు తెలిపారు.

Next Story