- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కిడ్నాపైన వడ్డే ఎల్లయ్య మృతదేహం లభ్యం
దిశ, సూర్యాపేట : గత 20 రోజుల క్రితం జిల్లాలో సంచలనం సృష్టించిన సూర్యాపేట మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,మాజీ మావోయిస్టు వడ్డే ఎల్లయ్య మృతదేహం జగ్గయ్య పేటలో లభ్యమైంది. పథకం ప్రకారం ఎల్లయ్యను హత్య చేసిన అనంతరం జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని నిందితులు కాల్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం.
దీంతో మంటలు పెద్దగా వ్యాపించడంతో భయపడి ఆ మంటలను చల్లార్చి అక్కడే గుంత తీసి తవ్వి పెట్టినట్లు తెలిసింది. కాగా జగ్గయ్యపేట తహసీల్దార్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. నేరస్తులు నేరం తప్పించుకునేందుకు ఎల్లయ్యను హత్య చేసిన అనంతరం చేపల లారీలో విశాఖపట్నం తరలించి సముద్రంలో పడేసినట్లు చెప్పిన విషయం తెలిసిందే.
భారీ బందోబస్తు నడుమ అంత్యక్రియలు....
ఎల్లయ్య హత్యానంతరం సూర్యాపేట మండలం యార్కరం గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న ఇళ్ల ధ్వంసం, భౌతిక దాడుల పరిణామాల దృష్ట్యా నాటి నుండి నేటి వరకు పోలీసులు భారీ పికెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఎల్లయ్య మృతదేహం దొరకడంతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో ఆ గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఇందులో భాగంగా ఒక డీఎస్పీ, నలుగురు సీఐలు,15 మంది ఎస్సైలు, 150 మంది కానిస్టేబుల్ లు బందోబస్తులో పాల్గొన్నారు.