Suicide :వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

by Aamani |
Suicide :వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య
X

దిశ, మీర్ పేట్: వరకట్నం కోసం అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్,జియగూడ కు చెందిన రమేష్ కు ఇద్దరు కుమార్తెలు చిన్న కుమార్తె శ్రీలత (26) ను 2021 లో సైదాబాద్ కు చెందిన సాయి భార్గవ కృష్ణకు తన కూతురితో వివాహం జరిపించారు. సాయి భార్గవ్ కృష్ణ ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయంలో బిల్ కలెక్టర్ గా పని చేస్తున్నాడు. సాయి భార్గవ శ్రీలత ల కు ఒకటిన్నర సంవత్సర కూతురు ఉంది.

సాయి భార్గవ దంపతులు స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్ పేట్ , గాయత్రి హిల్స్ లో నూతన ఇల్లు నిర్మించుకొని గత రెండు నెలలుగా అక్కడే నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా అదనపు కట్నం కోసం భర్త, అత్తలు తీవ్ర వేధింపులకు గురి చేయడంతో తీవ్ర మనస్తాపం చెందిన శ్రీలత సోమవారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న మీర్ పేట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన శ్రీలత ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి అని అత్త భర్త అదనపు కట్నం కోసం వేధించడంతో తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed