జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం… వ్యక్తి మృతి

by Disha Web Desk 11 |
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం… వ్యక్తి మృతి
X

దిశ, గద్వాల: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన గద్వాల మండలం లో శుక్రవారం చోటు చేసుకుంది. అయిజ మండలం ఎక్లాస్ పురం గ్రామానికి చెందిన ఇజ్రాయిల్ తన కుటుంబ సభ్యులతో కలిసి పని నిమిత్తం ఎర్రవల్లి చౌరస్తాకు బైక్ పై వెళ్తుండగా, గద్వాల మండలం అనంతపురం స్టేజ్ సమీపంలో గద్వాల్- కర్నూల్ జాతీయ రహదారి పై పాల వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇజ్రాయిల్(45) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో‌ పద్మమ్మతో పాటు కూతురికి గాయాలు కాగ చికిత్స కోసం గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న గద్వాల రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఆసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed