పేకాటరాయుళ్లపై పోలీసుల పంజా

by Aamani |
పేకాటరాయుళ్లపై పోలీసుల పంజా
X

దిశ, పర్వతగిరి : పర్వతగిరి మండల కేంద్రంలో కొమ్మరాజు ఉప్పల్లయ్య ఇంట్లో కొందరు వ్యక్తులు డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం పోలీసులకు అందింది. స్థానిక ఎస్సై గుగులోత్ వెంకన్న తన సిబ్బందితో కలిసి ఐదుగురు వక్తులను పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పేకాట ఆడిన వారిలో కొమ్మరాజు ఉప్పల్లయ్య,బాసని క్రాంతి ,ఓర్సు శ్రీకాంత్, పుల్లూరి రాజు , చెన్నూరి కుమారస్వామి ఉన్నారని వారిని పట్టుకొని వారి వద్ద నుంచి నగదు రూ. 7,180 నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని(52) పేక ముక్కలు సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు. మండల పరిధిలో ఎవరైనా పేకాట ఆడుతున్నట్లు తెలిసిన ఆడే వారి సమాచారం ఉన్న వెంటనే పోలీసులకు తెలియజేయాలని చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే ఉపేక్షించేది ఉండదని ఎస్సై వెంకన్న అన్నారు.

Next Story