పాలెం లో ఫోన్ హ్యాక్

by Sridhar Babu |
పాలెం లో ఫోన్ హ్యాక్
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని బాల్కొండ నియోజకవర్గానికి చెందిన మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన మైలారం ప్రవీణ్ కు సంబంధించిన అకౌంట్ లోని డబ్బులను సైబర్ మోసగాళ్లు మాయం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మైలారం ప్రవీణ్ అకౌంట్ లోని నగదును మాయం చేసేందుకు ఆయన సోదరుడు ఫోన్ ను సైబర్ మోసగాళ్లు హ్యాక్ చేసి ఆ నెంబర్ నుంచి ఏదో బ్యాంకు లింకు పంపినట్టుగా పంపి దాని ద్వారా వారికి కావలసిన సమాచారం తెలుసుకొని మైలారం ప్రవీణ్ అకౌంట్లో ఉన్న 94 వేల 160 రూపాయల నగదును మాయం చేశారు.

ఈ నగదు కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆయన అకౌంట్లో నుంచి పలు దఫాలుగా వెళ్లిపోయినట్లు బాధితుడు లబోదిబోమని మొత్తుకుంటున్నాడు. మా అన్నయ్య నంబర్ ను హ్యాక్ చేసి ఆ నంబర్ నుంచి బ్యాంకు డీటెయిల్స్ కావాలని తెలుసుకొని తనను మోసం చేశారని బాధితుడు మైలారం ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. మైలారం ప్రవీణ్ మోర్తాడ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

Advertisement

Next Story