- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బైక్ను ఢీకొట్టిన ఇన్నొవా.. యువకుడు మృతి
దిశ,నాగర్ కర్నూల్ : అత్యంత వేగంగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఓ ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తా సమీపంలోని ప్రధాన రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, నాగర్ కర్నూల్ మండలం చందుపట్ల గ్రామానికి చెందిన శివ (25) వ్యక్తిగత పనుల నిమిత్తం నాగర్ కర్నూల్ వెళ్తుండగా నాగర్ కర్నూల్ నుండి కొల్లాపూర్ చౌరస్తా ప్రాంతానికి వెళ్తున్న ఏపీ 29 ఏఆర్ 0599 నంబరు గల ఇన్నోవా కారు వేగంగా ఢీ కొట్టింది.
దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే ఇన్నోవా వాహనంలో ప్రయాణిస్తున్న వారంతా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులకు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. కారు వేగంగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఇన్నోవా వాహనం నాగర్ కర్నూల్ ఓ పార్టీకి చెందిన పార్లమెంట్ అభ్యర్థికి చెందిన ఎస్కార్ట్ వాహనం గా ప్రచారం జరుగుతుంది. ఇదే నెంబరు గల వాహనంపై సుమారు 35000 చలాన్లు పెండింగ్ లో ఉన్నట్లు చూపిస్తుంది. అన్ని నిబంధనలకు విరుద్ధంగా అతివేగం కారణంగా చలాన్లు నమోదు అయినట్లు తెలుస్తోంది.