బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి కాంగ్రెస్

by Disha Web Desk 15 |
బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి కాంగ్రెస్
X

దిశ, కొండాపూర్ : బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి కాంగ్రెస్ అని ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలలో మధు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆందులో భాగంగా రోడ్ షో లు, కార్నర్ మీటింగులు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, జయరెడ్డితో కలిసి మధు మాట్లాడారు. మల్కాపూర్ నుండి తొగర్పల్లి శివాజీ సెంటర్ వరకు రోడ్ షో నిర్వహించారు. అనంతరం కార్నర్ మీటింగ్ లో మధు ప్రసంగిస్తున్న

చోటుకి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ప్రచార వాహనం చేరుకుంది. దీంతో నీలం మధు ఆ ప్రచార వాహనాన్ని చూపిస్తూ.. కలెక్టర్ గా ఉన్న సమయంలో వెంకట్రాంరెడ్డి రైతులకు చేసిన అన్యాయాలను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్టు చెప్పారు. గత పాలకులు యువతను ఉద్యోగాల పేరిట మోసం చేశారని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికలలో యువత ఒక్కసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో ఎంపీపీ మనోజ్ రెడ్డి, మండల అధ్యక్షులు ప్రభు, కొండాపూర్ ఎంపీటీసీల పొరం మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీ నరసింహారెడ్డి, సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్ , పీఏసీఎస్ చైర్మన్ శ్రీకాంత్​రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు మల్లారెడ్డి, గ్రామాల అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed