కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్‌ను పంపిస్తుంది: ప్రధాని మోడీ

by S Gopi |
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్‌ను పంపిస్తుంది: ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష ఇండియా కూటమిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపైకి కాంగ్రెస్ బుల్డోజర్‌ను పంపిస్తుందని ఆరోపణలు చేశారు. శుకవారం ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన మోడీ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రామాలయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేయాలని చూస్తుందని, ఆ తర్వాత ఆలయాన్ని కూల్చివేస్తుందని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రామ్‌లల్లాను బలహీనపరుస్తాయని విమర్శించారు. దేశ విభజనకు కాంగ్రెస్‌దే బాధ్యతని, దేశం విడిపోతుందనే అంశం అసాధ్యం అనుకున్న దాన్ని ఆ పార్టీ వల్లనే జరిగింది. స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్న సమయంలో దేశాన్ని విభజించాలనే చర్చ వచ్చినప్పుడు, అందరూ ఆశ్చర్యపోయారు. దేశాన్ని విభజించవచ్చా? జరుగుతుందా అనుకున్నారు. కానీ కాంగ్రెస్ చేసింది. వారి ట్రాక్ రికార్డు అలాంటిదని మోడీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్‌కు దేశం పట్ల పట్టింపు లేదు. వాళ్లకు కుటుంబం, అధికారం కోసమే పనిచేస్తుంటారన్నారు.



Next Story