నల్లగొండలో కిడ్నాప్ కలకలం..చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు

by Aamani |
నల్లగొండలో కిడ్నాప్ కలకలం..చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు
X

దిశ,నల్లగొండ: నల్లగొండ పట్టణ కేంద్రంలోని మదీనా కాలనీకి చెందిన కొలిల్కర్ మణిదీప్ ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నల్లగొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ఆదేశాల మేరకు ప్రత్యేక టీంలుగా ఏర్పడి కిడ్నాప్ కి గురైన వ్యక్తినీ మొయినాబాద్ ప్రాంతంలో 12 గంటల లోపు చేదించడం జరిగింది.వివరాల్లోకి వెళితే నల్గొండ మదీనా కాలనీ కి చెందిన కొలిల్కర్ మణిదీప్ కి మొయినాబాద్ కి చెందిన మంజుల కి 13 సంవత్సరాల క్రితం పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కలరు, భార్య భర్తల మధ్య విభేదాలు రావడం తో 8 నెలల క్రితం మణిదీప్ తన భార్యతో విడాకులు తీసుకోవడం తో అది మనసులో పెట్టుకున్న తన భార్య, తన తమ్ముడు సందీప్ తో మరో నలుగురు కలిసి, మొత్తం ఆరుగురు ఈరోజు అనగా 12/09/2024 నాడు ఎర్టిగా కారు లో నల్గొండకి వచ్చారు.

మదీనా కాలనీ లో ఉన్న మణిదీప్ ఇంటికి వచ్చి మణిదీప్ ని, వాళ్ల అమ్మ లలిత ని బాగా కొట్టి, మణిదీప్ ని తాము వచ్చిన కార్ లో కిడ్నాప్ చేసుకొని మొయినాబాద్ వైపు వెళ్తున్నారు. మణిదీప్ అమ్మ లలిత వెంటనే ఆ సమాచారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి చెప్పడంతో,వెంటనే పై అధికారులకు సమాచారం ఇచ్చిన ఎస్ ఐ రావుల నాగరాజు,తన సిబ్బందితో కలిసి లొకేషన్ ఆధారంగా మొయినాబాద్ మండలం,పెద్ద మంగళం గ్రామం లో కిడ్నాప్ అయిన వ్యక్తి ని గుర్తించి రక్షించి, అతనిని కిడ్నాప్ చేసిన అతని మొదటి భార్య మంజులని,ఆమె తమ్ముడు అయినా సందీప్ ని పట్టుకొనగ,మిగతా వారు పోలీస్ వారిని చూసి పారిపోవడం జరిగింది.ఈ కేసును 24 గంటల్లో చేదించినందుకు గాను నల్లగొండ డీఎస్పీ కె.శివరాం రెడ్డి పర్యవేక్షణలో సీఐ డానియల్ ఆధ్వర్యంలో 2 టౌన్ ఎస్ఐ నాగరాజు,పీసీ నాగరాజు లను జిల్లా ఎస్పీ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed