- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తాడిచెట్టుపై నుంచి బావిలో పడి గీత కార్మికుడు..
by Disha Web Desk 4 |
X
దిశ, తిరుమలాయపాలెం: తాడిచెట్టుపై నుంచి వ్యవసాయ బావిలో పడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన శుక్రువారం ఉదయం మండలంలో వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన, మల్లారపు వెంకన్న(55) కల్లు గీత కార్మికుడు రోజులాగే సమీప గ్రామమైన చంద్రుతండాలో తాడిచెట్టు ఎక్కుతున్నాడు. అయితే ప్రమాదవశత్తు చెట్టుపై నుంచి, జారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయాడు.
ఈ ప్రమాదంలో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహకారంతో వెంకన్న మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు.
Next Story