గ్యాస్ కంపెనీ కూలీ ఆత్మహత్య.. ఆ కారణంతోనే..

by Bhoopathi Nagaiah |
గ్యాస్ కంపెనీ కూలీ ఆత్మహత్య.. ఆ కారణంతోనే..
X

దిశ, నిజాంపేట: ఆర్థిక పరిస్థితుల కారణంగా రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని అక్కన్న పేట గ్రామంలో గురువారం జరిగింది. రైల్వే పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. రామాయంపేట మండలం గొల్పర్తి గ్రామానికి చెందిన వెంకటాపురం శివరాములు (32) గ్యాస్ కంపనీలో కూలీగా పని చేస్తున్నాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా మనస్థాపానికి గురై గత రాత్రి ఇంటి నుండి వెళ్ళిపోయాడు. ఈక్రమంలో రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కామారెడ్డి హాస్పిటల్‌కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed