- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Crime : భార్యను చంపి.. బిల్డింగ్ మీద నుంచి దూకి భర్త సూసైడ్.. ? అసలేం జరిగింది..
దిశ, వెబ్డెస్క్ : ముంబైలోని గోరేగావ్ లో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో కిషోర్ పెడ్నేకర్ (58) అనే వ్యక్తి జిమ్ ఎక్విప్మెంట్ సేల్స్మెన్గా పనిచేస్తు జీవనం సాగిస్తున్నాడు. కాగా ఈ రోజు జవహర్ నగర్లోని టోపీవాలా మాన్షన్ ముందు రహదారిపై అతడి మృతదేహం కనిపించింది. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని,అతన్ని హుటాహుటీన ఆసుపత్రికి తరలించిగా అప్పటికే అతడు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
ఈ క్రమంలో.. అతడి మరణం గురించి పోలీసులు ఆయన భార్యకు చెప్పేందుకు పలుమార్లు ఫోన్ చేయగా.. ఆమె లిఫ్ట్ చేయలేదు. దీంతో ఈ దంపతులు నివాసం ఉంటున్న ఆ ఫ్లాట్కు పోలీసులు చేరుకున్నారు. అయితే ఫ్లాట్ డోర్కి లాక్ వేసి ఉంది. దీంతో మృతుడు కిషోర్ మెడలో డోర్ లాక్ ఉండటం గమనించిన పోలీసులు, ఆ కీ సహాయంతో డోర్ ఓపెన్ చేసి లోపలికి ప్రవేశించారు. అయితే అక్కడి దృశ్యం చూసి పోలీసులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఎందుకంటే కిషోర్ భార్య రాజశ్రీ (57) కూడా మృతి చెందింది.అతని ఇంట్లో డిప్రెషన్, డయాబెటిస్కు సంబంధించిన మందులను పోలీసులు కనుగొన్నారు. అయితే ఆమె భర్తనే రాజశ్రీ గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.కాగా .. కిషోర్ తొలుత తన భార్య గొంతు నులిమి హత్య చేసి, అనంతరం అతను బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.