గర్భంతో ఉన్న యువతిని గొంతు నులిమి చంపిన తల్లిదండ్రులు..

by Vinod kumar |
గర్భంతో ఉన్న యువతిని గొంతు నులిమి చంపిన తల్లిదండ్రులు..
X

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో అమానుషం జరిగింది. 8 నెలల గర్భంతో ఉన్న కుమార్తెను కన్నవారే కర్కశంగా కడతేర్చారు. తాము చెప్పినట్టు వినలేదన్న కోపంతో ఇంతటి దారుణానికి పాల్పడ్డారు. గతేడాది అక్టోబర్‌లో ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయిన ఆ యువతి ఆచూకీ రెండు నెలల పాటు దొరకలేదు. ఎట్టకేలకు డిసెంబరులో ఆచూకీ దొరకడంతో పేరెంట్స్ తమ ఇంటికి తీసుకొచ్చారు. ఆ యువకుడిపై కేసు పెట్టి జైలుకు పంపారు. అయితే అప్పటికే యువతి గర్భం దాల్చింది. దీంతో ఆ యువతితో తరుచూ పేరెంట్స్ గొడవకు దిగుతున్నారు.

ఆ యువకుడు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ యువతిపై పేరెంట్స్ ఒత్తిడి పెంచారు. కోర్టు విచారణలోనూ ఇదే చెప్పాలని బలవంతం చేశారు. కానీ అందుకు యువతి ఒప్పుకోలేదు. కోపంతో రగిలిపోయిన తల్లిదండ్రులు శుక్రవారం (ఆగస్టు 25న) రాత్రి కన్న కూతురి గొంతు నులిమి చంపారు. ఆ తరువాత మృతదేహాన్ని దగ్గర్లోని నదిలో విసిరేశారు. పోలీసులకు స్టేట్‌మెంట్‌ ఇచ్చేందుకు యువతి రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులు ఆరా తీశారు. తల్లిదండ్రుల్ని విచారించగా.. తామే హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. వాళ్లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed