వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి.. హాస్పిటల్ ముందు తల్లిదండ్రుల ఆందోళన

by Aamani |
వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి..  హాస్పిటల్ ముందు తల్లిదండ్రుల ఆందోళన
X

దిశ,హనుమకొండ : సెప్టెంబర్ 12 హన్మకొండ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 8 సంవత్సరాల సాయి శ్రీ, గురువారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే హన్మకొండ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జ్వరం వచ్చిందని ఈ నెల తొమ్మిదో తేదీన తల్లిదండ్రులు అడ్మిట్ చేశారు. అయితే.. 8 సంవత్సరాల పాప సాయి శ్రీ కి డెంగ్యూ ఫీవర్ అని చెప్పి వైద్యులు ట్రీట్మెంట్ చేశారని, దీంతో ఒక రోజు ముందు పాప ఆరోగ్యం నిలకడగానే ఉంది ఎలాంటి భయం లేదు అని వైద్యులు హామీ ఇచ్చారని, దీంతో గురువారం ఉదయం తల్లిదండ్రులు వెళ్లి పాపను చూస్తే చనిపోయి ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. డాక్టర్లు పట్టించుకోలేదని అందువల్లనే తమ పాప చనిపోయిందని హాస్పిటల్ ఎదుట పాప తల్లిదండ్రులు, బంధువులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు.

Advertisement

Next Story

Most Viewed