SP Shri Kiran Khare : రూ.1.59 లక్షల విలువైన గంజాయి దహనం

by Sridhar Babu |
SP Shri Kiran Khare : రూ.1.59 లక్షల విలువైన గంజాయి దహనం
X

దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 2020 నుంచి 25 కేసుల్లో ఒక కోటి 59 లక్షల విలువ గల 636 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాంతో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారం హన్మకొండ సుబేదారీలోని కాకతీయ మెడిక్లిన్ వద్ద సైంటిఫిక్ పద్ధతిలో దహనం చేసినట్లు జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కిరణ్ ఖరే

శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, ఎవరైనా అక్రమ గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. జిల్లాలో గంజాయి, డ్రగ్స్ పై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. మత్తు పదార్థాల వినియోగంతో నూరేళ్ల జీవితం నాశనం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు సంపత్ రావు, రామ్మోహన్ రెడ్డి, నారాయణ నాయక్, భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్, జిల్లా పరిధిలోని రిజర్వు ఇన్​స్పెక్టర్ లు, ఎస్ఐలు పాల్గొన్నారు.



Next Story