సిగరెట్ ఏజెన్సీలో చోరీ

by Disha Web Desk 15 |
సిగరెట్ ఏజెన్సీలో చోరీ
X

దిశ, కామరెడ్డి క్రైమ్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్ లో గల ఓ సిగరెట్ ఏజెన్సీలో చోరీ జరిగి సుమారు 10 లక్షల విలువగల సిగరెట్లు అపహరణకు గురైనట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గంజి మార్కెట్ లో ఉన్న శ్రీ రాఘవేంద్ర ట్రేడర్స్ అనే సిగరెట్ల కంపెనీలో గురువారం

తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కంపెనీ లోకి చొరబడి 8 కార్టన్ల సిగరెట్ డబ్బాలను దొంగిలించారు. వీటి విలువ సుమారు 10 లక్షల వరకు ఉంటుందని బాధితులు తెలిపారు. యజమాని శశిధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించినట్టు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed