నిజామాబాద్‌లో యువకుడి దారుణ హత్య

by Satheesh |
నిజామాబాద్‌లో యువకుడి దారుణ హత్య
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరం నాలుగో టౌన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వినాయక్ నగర్- హైదరాబాద్ ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓ టీ స్టాల్ ముందు బుధవారం రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడి మృతదేహం లభ్యమైంది. టీ స్టాల్ యజమాని ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పట్టణ సీఐ నరహరి నాలుగో టౌన్ ఎస్ఐ పాండేరావ్‌లు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాల కోసం గాలింస్తున్నారు. మంగళవారం రాత్రి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీస్ జాగిలం రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న వైన్స్ పర్మిట్ రూమ్ వద్దకు వెళ్లి ఆగినట్టు సమాచారం. దీంతో పర్మిట్ రూమ్ వద్ద ఉన్న సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Next Story

Most Viewed