BREAKING: ఫుట్‌పాత్ పైనుంచి దూసుకెళ్లిన భారీ ట్రక్కు.. ముగ్గురు దుర్మరణం, ఇద్దరి పరిస్థితి విషమం

by Shiva |
BREAKING: ఫుట్‌పాత్ పైనుంచి దూసుకెళ్లిన భారీ ట్రక్కు.. ముగ్గురు దుర్మరణం, ఇద్దరి పరిస్థితి విషమం
X

దిశ, వెబ్‌డెస్క్: ఫుట్‌పాత్ పైకి ట్రక్కు దూసుకెళ్లి ముగ్గురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పు ఢిల్లీలోని శాస్త్రి పార్క్ సమీపంలో తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో సీలంపూర్ వైపు నుంచి ఓ భారీ ట్రక్కు వెళ్తోంది. ఈ క్రమంలోనే అతివేగంతో ట్రక్కు అదుపుతప్పి ఫుట్‌పాత్‌ నిద్రిస్తున్న నిరాశ్రయులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు స్పాట్‌లో ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు గాయపడిన ఇద్దరిని జగ్‌ప్రవేశ్ చంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో జీటీబీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ట్రక్కు డ్రైవర్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement

Next Story

Most Viewed