ప్రెషర్ కుక్కర్‌తో ప్రియురాలి మర్డర్..

by Vinod kumar |
ప్రెషర్ కుక్కర్‌తో ప్రియురాలి మర్డర్..
X

బెంగళూరు : బెంగళూరులో ఓ వ్యక్తి తన ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. తనతో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రేయసి దేవా(24)పై అనుమానం వచ్చి.. ప్రెషర్ కుక్కర్‌తో బాది వైష్ణవ్ (29) మర్డర్ కు పాల్పడ్డాడు. కేరళకు చెందిన వీరిద్దరు కాలేజీ రోజుల నుంచే ఒకరికొకరు తెలుసు. చదువు పూర్తయినప్పటి నుంచి బెంగళూరులోని ఓ మార్కెటింగ్ కంపెనీలో వీరిద్దరూ జాబ్ చేస్తున్నారు. గత 18 నెలలుగా అదే సిటీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ సహజీవనం చేస్తున్నారు. అయితే తన ప్రేయసి దేవా మరొకరితో సంబంధం కలిగి ఉందేమోనని వైష్ణవ్ అనుమానించసాగాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి.

తాజాగా శనివారం ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్రమైంది. ప్రియురాలిపై కోపంతో ఊగిపోయిన వైష్ణవ్ కిచెన్ లోకి వెళ్లి ప్రెషర్ కుక్కర్ తీసుకొచ్చి.. అందులో ఉన్న అన్నాన్ని ప్లేట్లోకి తీసి, ఖాళీ కుక్కర్‌తో ఆమె తలపై మూడుసార్లు బలంగా మోదాడు. తీవ్ర గాయాలవడంతో ఆ యువతి అక్కడికక్కడే చనిపోయింది. యువతి సోదరి కృష్ణ ఫోన్ కాల్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దేవ ఎంతసేపటికీ ఫోన్ లేపకపోవడంతో.. ఆమె సోదరి కృష్ణ పొరుగింటివారికి కాల్ చేసింది. వారు వచ్చి చూడగా ఇంట్లో రక్తపుబెంగళూరులో ఓ వ్యక్తి తన ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు.మడుగులో దేవ పడి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న వైష్ణవ్ ను అరెస్ట్ చేశారు. దేవను తానే హత్య చేసినట్టు వైష్ణవ్ ఒప్పుకున్నాడు. తాను అనేక పర్యాయాలు హెచ్చరించినా దేవ వినలేదని, మరో వ్యక్తి మోజులో పడిందని అతడు పోలీసులకు తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed