రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి.. వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని ఎస్సై సూచన

by Aamani |
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని  వ్యక్తి మృతి.. వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని ఎస్సై సూచన
X

దిశ, కరీంనగర్ టౌన్ : నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన కొత్తపల్లి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మెడికల్ కాలేజ్ దగ్గర గురువారం అర్ధరాత్రి వికలాంగుడు రోడ్డు దాటుతున్న క్రమంలో వాహనం ఢీకొని మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి రెండు కాళ్లు సరిగా లేవని నడవలేడని పాకుతూ రోడ్డుపై వెళ్తాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీ లో ఉంచినట్లు తెలిపారు. ఎవరికైనా వివరాలు తెలిస్తే కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed