Accident: కూలీల కోసం వెళ్లి… రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

by Kalyani |
Accident: కూలీల కోసం వెళ్లి… రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
X

దిశ, భూత్పూర్: తమ పొలంలో నాట్లు వేయించడానికి అవసరమైన కూలీలను పిలవడానికి మోటార్ సైకిల్ పై వెళ్లి రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన సంఘటన శుక్రవారం భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో జరిగింది. ఇందుకు సంబంధించి భూత్పూర్ ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని షేర్ పల్లి (హెచ్) గ్రామానికి చెందిన ఎల్పటి రాములు కుమారుడు ఎల్పటి సాయి తేజ (21) అనే యువకుడు తమ పొలంలో నాట్లు వేయడానికి అవసరమైన కూలీలను తీసుకురావడానికి తన మోటార్ సైకిల్ పై జడ్చర్ల మండలం బూరుగుపల్లి గ్రామం నుండి కూలీలను తీసుకురావడానికి తన మోటార్ సైకిల్ పై బయలుదేరాడు. భూత్పూర్ వద్ద జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు నుండి వెళుతుండగా .. బొలెరో వాహనం వేగంగా మోటార్ సైకిల్ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో తీవ్ర గాయాలైన సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో శేరిపల్లి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.



Next Story