బావిలో దూకి మహిళ ఆత్మహత్య

by Disha Web Desk 23 |
బావిలో దూకి మహిళ ఆత్మహత్య
X

దిశ,జులపల్లి: కరీంనగర్ విద్యానగర్ కు చెందిన కామ రజిత భర్త ప్రభాకర్ (47). ఆమెకు ఇద్దరు కొడుకులు. ఆమె భర్త 18 సంవత్సరాల క్రితం చనిపోయాడు. మృతురాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు ఉదయం జూలపల్లి మండలం కాచాపూర్ లోని తన తల్లి ఇంటికి వెళ్తున్నానని ఇంట్లో ఉన్న తన పెద్ద కొడుకు చెప్పి బయలుదేరింది. అనారోగ్యం కారణం చేత జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామం కురుమ పల్లికి సమీపంలో, రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు కొడుకు కామ సాయికుమార్ దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న జూలపల్లి ఎస్సై శ్రీధర్ తెలిపారు.

Next Story

Most Viewed