డ్యాంలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

by Sridhar Babu |
డ్యాంలో ఈతకు వెళ్లి  విద్యార్థి మృతి
X

దిశ, బోనకల్ : బోనకల్ గ్రామానికి చెందిన గుడిమళ్ల సాయి కృష్ణ (14) నాగులవంచ ఆదర్శ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. ఈరోజు ఆదివారం కావడంతో వాళ్ల బంధువులు ఉప్పలమ్మ కార్యక్రమం ఉందని చిరునోముల గ్రామానికి తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఆ కార్యక్రమం చూసుకొని పక్కనే ఉన్న పోలంపల్లి డ్యాం వద్దకు ఐదుగురు కలిసి ఈతకు వెళ్లాడు. డ్యాంలో ఈత కొడుతుండగా ఇద్దరు స్నేహితులు చాలా లోతులోకి వెళ్లి కేకలు పెడుతుండగా దగ్గర్లో ఉన్న జాలర్లు ఒకరిని కాపాడారు. కానీ సాయికృష్ణ అక్కడే మరణించాడు.

Advertisement

Next Story

Most Viewed