స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం...కత్తితో దాడి

by Sridhar Babu |
స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం...కత్తితో దాడి
X

దిశ, చార్మినార్ : ​ స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం కత్తిపోట్లకు దారితీసిన ఘటన బండ్లగూడ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్ స్పెక్టర్ కె.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. గౌస్​నగర్​కు చెందిన అబ్దుల్లా, మహ్మద్ షరీఫ్ ఖాన్ ఇద్దరు స్నేహితులు. వీరు మరికొంత మందితో కలిసి శుక్రవారం రాత్రి ఉందా హిల్స్ చెరువులో చేపలు పట్టడానికి వెళ్లారు.

ఆ సమయంలో యూసుఫ్, సమీర్, జహీర్, అర్బాన్ అనే యవకులు అక్కడికి వచ్చారు. ఆ సమయంలో అబ్దుల్లా సమీర్ అనే యువకునిపై కామెంట్ చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన సమీర్ అబ్దుల్లాను కొట్టాడు. దీంతో రెండుగ్రూపుల మధ్య పరస్పరం కర్రలు, రాళ్ల, కత్తితో దాడి చేసుకున్నారు. ఈ సంఘటనలో అబ్దుల్లా బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు గ్రూపులపై హత్యాయత్నం కేసు నమోదు బండ్ల గూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story