- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం...కత్తితో దాడి
by Sridhar Babu |
![స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం...కత్తితో దాడి స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం...కత్తితో దాడి](https://www.dishadaily.com/h-upload/2024/06/29/347403-daadi.webp)
X
దిశ, చార్మినార్ : స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం కత్తిపోట్లకు దారితీసిన ఘటన బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్ స్పెక్టర్ కె.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. గౌస్నగర్కు చెందిన అబ్దుల్లా, మహ్మద్ షరీఫ్ ఖాన్ ఇద్దరు స్నేహితులు. వీరు మరికొంత మందితో కలిసి శుక్రవారం రాత్రి ఉందా హిల్స్ చెరువులో చేపలు పట్టడానికి వెళ్లారు.
ఆ సమయంలో యూసుఫ్, సమీర్, జహీర్, అర్బాన్ అనే యవకులు అక్కడికి వచ్చారు. ఆ సమయంలో అబ్దుల్లా సమీర్ అనే యువకునిపై కామెంట్ చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన సమీర్ అబ్దుల్లాను కొట్టాడు. దీంతో రెండుగ్రూపుల మధ్య పరస్పరం కర్రలు, రాళ్ల, కత్తితో దాడి చేసుకున్నారు. ఈ సంఘటనలో అబ్దుల్లా బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు గ్రూపులపై హత్యాయత్నం కేసు నమోదు బండ్ల గూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story