మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య

by Sridhar Babu |
మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, మిరుదొడ్డి : కుటుంబ సమస్యలు తట్టుకోలేక వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మిరుదొడ్డి గ్రామానికి చెందిన ధర్మారం కనకయ్యకు ఒక కుమారుడు రాజు, కూతురు దీపికలు ఉన్నారు. కూతురు దీపిక వివాహం చేయగా, రెండు నెలల క్రితం తన భర్తతో విభేదాలు రావడంతో విడిపోయింది.

దాంతో మనోవేదనకు గురై మానసికంగా కృంగిపోయిన కనకయ్య శనివారం సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి మిరుదొడ్డి గ్రామంలోని ఎస్సీ హాస్టల్ వెనుక గల గొర్ల కొట్టంలో పైపునకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మిరుదొడ్డి ఎస్ఐ పరశురాములు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed