మరదలిపై బావ అత్యాచారం..

by Aamani |
మరదలిపై బావ అత్యాచారం..
X

దిశ,దుబ్బాక : సొంత తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న, తన భార్య సహాయంతో మరదలిపై అత్యాచారం చేశాడు. వారిద్దరిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించిన ఘటన అక్బర్ పేట- భూంపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై దుబ్బాక సర్కిల్ పోలీస్ కార్యాలయంలో సీఐ పి. శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించి, ఘటన వివరాలు వెల్లడించారు. ఖాజీపూర్ గ్రామానికి చెందిన ఒక కామాంధుడు తన సొంత తమ్ముడి భార్యపై కన్నేశాడు. తన తమ్ముడికి పెళ్లయి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా, పిల్లలు కాకపోవడంతో తన కోరిక తీర్చాలని తన భార్య సహాయం తో మరదలిని భయపెట్టి, లొంగదీసుకుని ఆమెపై అత్యాచారం చేశాడు.

ఈ అత్యాచారం ఘటనను భార్య సహాయంతో వీడియో కూడా తీయించి, బెదిరించసాగాడు. పదేపదే బావ, అతని భార్య వేధింపులు భరించలేక భర్త అత్త మామ దృష్టికి తీసుకు పోయిన వారు పట్టించుకోలేదు.దీంతో ఆ మహిళ తన తల్లి, బంధువుల సహాయంతో దుబ్బాక సర్కిల్ కార్యాలయంలో సీఐకి ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూంపల్లి పోలీసులు అత్యాచారం చేసిన వ్యక్తితో పాటు అతని భార్యపై అత్యాచారం కింద కేసు నమోదు చేసి, వారిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరు పరచి, రిమాండ్ కు తరలించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం సిద్దిపేటలోని భరోసా కేంద్రానికి తరలించారు. ఈ సమావేశంలో భూంపల్లి ఎస్సై వడ్లకొండ హరీష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed