- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి
దిశ,ఏటూరునాగారం : అర్ద రాత్రి సమయంలో కారు అదుపు తప్పి చెట్టుకు ఢీ కొట్టిన ఘటనలో సీఐఏస్ఏఫ్ జవాన్ మృతి చెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో చోటు చేసుకుంది. మృతుడు అనిల్ భార్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహరాష్ట్ర, లాతోర్ జిల్లా అమాంతపూర్ తాలుకా మండలం దేవ్కోర్ గ్రామానికి చెందిన సురావసే అనిల్(35) విశాఖపట్నంలో సీఐఏస్ఏఫ్గా జవాన్గా విధులు నిర్వహిస్తున్నాడు.
అయితే మంగళవారం రోజున భార్య అయోధ్య(30) కూమారుడు రాజ్వీర్(చిన్ను)(2) తో కలిసి కారులో విశాఖపట్నం నుండి మహరాష్ట్రకు వెలుతుండగా మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఏటూరునాగారం మండలం జీడీవాగు సమీపాన ప్రమాదవ శాత్తు కారు అదుపు తప్పి చెట్టుకు ఢీ కొంది. ఈ ప్రమాదంలో అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య, కూమారుడుకి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలిసులు ఘటన స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం గాయాలపాలైయిన వారిని ఏటూరునాగారం సామాజిక ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. అనిల్ మృతదేహన్ని మార్చరికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలిసులు తెలిపారు.