ఒకే ఇంట్లో ఐదుగురు మృతి…

by Sumithra |
ఒకే ఇంట్లో ఐదుగురు మృతి…
X

ఢిల్లీలో దారుణం జ‌రిగింది. ఒకే ఇంట్లో ఐదుగురు మృతిచెందారు. ఇంట్లోనే వాళ్లు శ‌వాలుగా తేలారు. దంప‌తుల‌తో పాటు వారి ముగ్గురి పిల్ల‌లు అనుమానాస్ప‌ద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య ఢిల్లీలోని భ‌జ‌న్‌పురాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దాదాపు నాలుగు రోజుల ముందే వాళ్లు మ‌ర‌ణించిన‌ట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం… ఐదుగురి శ‌రీరాలు కుల్లిపోయాయని పోలీసులు నిర్ధారించారు. ఇంటి య‌జ‌మాని శంబు అనే వ్య‌క్తి రిక్షా న‌డిపే వాడ‌ని, ఆరు నెల‌ల క్రిత‌మే ఆ ఫ్యామిలీ కొత్త ఇంట్లోకి చేరిన‌ట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్టున్నట్టు తెలిపారు.

Next Story

Most Viewed