రోశయ్యకు కరోనా పాజిటివ్

by  |
రోశయ్యకు కరోనా పాజిటివ్
X

దిశ, అమరావతి బ్యూరో: ఏపీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రజాప్రతినిధులు వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్యకు కరోనా సోకింది. శుక్రవారం వచ్చిన నివేదికలో పాజిటివ్ వచ్చినట్లు ఆయనే స్వయంగా వీడియో సందేశం ద్వారా తెలిపారు. అయితే తనకు కరోనా లక్షణాలు లేవని ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉంటున్నట్లు తెలిపారు. కరోనా సోకినా తనకు ఎలాంటి భయం లేదని, ధైర్యంగా ఎదుర్కొంటానని రోశయ్య అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఫోన్‌లో అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు.



Next Story

Most Viewed