కారు ధ్వంసం వెనుక వైసీపీ హస్తం..!

by srinivas |
కారు ధ్వంసం వెనుక వైసీపీ హస్తం..!
X

దిశ, వెబ్‎డెస్క్: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ కారు ధ్వంసం అయింది. అర్ధరాత్రి సమయంలో కారు అద్దాలు గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారు. విజయవాడ గురునానక్‎లోని పట్టాభిరామ్ నివాసం వద్ద ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్‎ను పరిశీలిస్తున్నారు. ఆకతాయిల పనా.. ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తన కారు ధ్వంసం వెనుక వైసీపీ ఎమ్మెల్యేల హస్తం వుందని పట్టాభిరామ్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నందుకే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

Next Story

Most Viewed