ఇరాన్‌కు వెళ్తున్న ఓడపైనా హౌతీల ఎటాక్

by Hajipasha |
ఇరాన్‌కు వెళ్తున్న ఓడపైనా హౌతీల ఎటాక్
X

దిశ, నేషనల్ బ్యూరో : యెమన్ హౌతీ మిలిటెంట్లకు ప్రధాన మద్దతుదారుగా ఇరాన్ దేశమే నిలుస్తోంది. అలాంటి ఇరాన్ దేశం వైపుగా వెళ్తున్న ఓడపైకి కూడా హౌతీ మిలిటెంట్లు సోమవారం రెండు మిస్సైళ్లను ప్రయోగించారు. ఈ క్షిపణుల ధాటికి ఓడకు స్వల్ప నష్టం వాటిల్లింది. అయితే దానిలో ఉన్న సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. హౌతీలు ఎటాక్ చేసిన ఆ ఓడ పేరు ‘స్టార్ ఐరిస్’ అని.. అది ఒక గ్రీకు కంపెనీకి చెందినదని గుర్తించారు. ఈ కంపెనీ అమెరికా స్టాక్ మార్కెట్‌లో లిస్టయి ఉందని తెలిపారు. ఈ ఓడ బ్రెజిల్ నుంచి ఇరాన్‌లోని బందర్ ఖొమేనీ ఓడరేవు వైపు వెళ్తుండగా మిస్సైల్ ఎటాక్ జరిగిందన్నారు. అది అమెరికా నౌక అయి ఉండొచ్చని భావించి.. హౌతీలు ఈ దాడి కి పాల్పడ్డారని భావిస్తున్నారు.

Next Story

Most Viewed