Israel: ఇజ్రాయెల్‌లో మరోసారి కాల్పులు.. ఓ మహిళ మృతి

by vinod kumar |
Israel: ఇజ్రాయెల్‌లో మరోసారి కాల్పులు.. ఓ మహిళ మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. దక్షిణ ఇజ్రాయెల్‌లోని బీర్షెబా నగరంలో ఆదివారం దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ 25 ఏళ్ల మహిళ మృతి చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. బీర్షెబా సెంట్రల్ బస్ స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనను ఉగ్రవాద దాడిగా పరిగణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తి సైతం హతమైనట్టు పలు కథనాలు వెల్లడించాయి. గత వారం కూడా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లో కాల్పులు జరగగా ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్‌లోని మిలిటెంట్ గ్రూపులపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో హింసాత్మక పరిస్థితులు నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed