ఇజ్రాయెల్ దాడుల్లో 13 మంది బందీల మృతి : హమాస్

by Vinod kumar |
ఇజ్రాయెల్ దాడుల్లో 13 మంది బందీల మృతి : హమాస్
X

గాజా : హమాస్ మిలిటెంట్ల స్థావరాలున్న గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడుల్లో దారుణం చోటుచేసుకుంది. ఈ ఎటాక్స్‌లోనే 13 మంది బందీలు ప్రాణాలు కోల్పోయారని హమాస్ మిలిటరీ విభాగం ప్రకటించింది. వారిలో ఇజ్రాయెలీలతో పాటు పలు దేశాల పౌరులు కూడా ఉన్నారని తెలిపింది. గత 24 గంటల వ్యవధిలో గాజాలోని ఐదు ప్రాంతాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు జరిపిన దాడుల్లో అక్కడున్న పౌరులతో పాటు ఆ పదమూడు మంది చనిపోయారని వెల్లడించింది.

ఈ నేపథ్యంలో హమాస్ అదుపులో ఉన్న బందీలను విడిపించుకునేందుకుగానూ ఇజ్రాయెల్‌ గ్రౌండ్‌ ఆపరేషన్‌కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే ఉత్తర గాజాలో ఉన్న 11 లక్షల మంది పాలస్తీనా పౌరులు 24 గంటల్లో ఆ ప్రాంతాన్ని వీడాలని అల్టిమేటం ఇచ్చింది. అయితే ఈ విధంగా ఇజ్రాయెల్ ఆదేశాలు ఇవ్వడాన్ని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని స్పష్టం చేసింది.

Advertisement

Next Story