‘మా ఇంటి స్థలాన్ని కాపాడండి’

by  |
‘మా ఇంటి స్థలాన్ని కాపాడండి’
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: కబ్జాదారుల చెర నుంచి తమ భూమిని కాపాడాలని ఓ బాధితుడు మీడియా ఎదుట ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కేంద్రానికి బాధితుడు పుతుంబాక రమేశ్ మీడియా ఎదుట తన గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ… జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ బైపాస్ రోడ్డు సమీపంలోని సర్వే నెంబర్ 88లో 2005లో 200 గజాల ఇంటి స్థలాన్ని తన భార్య పుటుంబాక జానకి పేరుమీద కొనుగోలు చేశానని తెలిపారు.

ప్రస్తుతం ఈ స్థలాన్ని ఇందిరానగర్‌కు చెందిన పి.ప్రవీణ్ అనే వ్యక్తి కబ్జా చేశాడని, దీనిపై ఆయన్ను నిలదీయగా చంపుతానని బెదిరించాడని ఆరోపించారు. ఈనెల 1వ తేదీన ఆ భూమిలో బోరు వేయిస్తున్నాడని తెలిసి, వెళ్లి ప్రవీణ్‌ను ప్రశ్నించగా అతని అనుచరులు ఆయుధాలతో వచ్చి చంపుతామని బెదిరించార‌ని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి పలుమార్లు రెవెన్యూ అధికారులకు, జిల్లా అధికారులకు తెలియజేసినప్పటికీ తమకు న్యాయం జరుగడం లేదని బాధితుడు రమేశ్ వాపోయారు.


Next Story

Most Viewed