ముగిసిన ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం.. బైడెన్ కీలక వ్యాఖ్యలు

by vinod kumar |
ముగిసిన ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం.. బైడెన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయిల్.. పాలస్తీనా మధ్య 11 రోజుల యుద్ధం శుక్రవారం ముగిసింది. పాలస్తీనాలోని గాజా స్ట్రిప్ ప్రాంతం నుండి ఇజ్రాయిల్‌పై రాకెట్ల కాల్పులు ఆపాయి. ఇజ్రాయెల్ వైమానిక దళం కూడా గాజాపై బాంబు దాడులను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఉద్రక్తతలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ”హమాస్‌తోపాటు గాజాలోని ఇతర మిలిటెంట్ గ్రూప్‌లు విచక్షణ రహితంగా జరుపుతున్న కాల్పుల నుంచి తమను రక్షించుకునే ఇజ్రాయెల్ హక్కులకు అమెరికా సంపూర్ణంగా మద్దతు పలుకుతోంది. గాజా నుంచి జరుపుతున్న కాల్పులతో ఇజ్రాయెల్‌లోని అమాయక పౌరులు మరణిస్తున్నారు”అని బైడెన్ అన్నారు. అమాయకులైన పౌరుల భద్రత కోసం అన్నిరకాల చర్యలూ చేపట్టేలా ఇజ్రాయెల్‌ను ప్రోత్సహిస్తున్నాం అని బైడెన్ వెల్లడించారు.

Advertisement

Next Story