ఘోరం.. ట్రాక్టర్ కింద పడి ఇద్దరు మృతి..

by Sumithra |   ( Updated:2021-12-10 04:49:27.0  )
roadaccident
X

దిశ, రామారెడ్డి: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం శివారులో ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. గిద్ద గ్రామానికి చెందిన నాయిని ఆశిరెడ్డి(45),యెన్నం గంగరాజు(40)అనే వ్యక్తులు ఉదయం 11:30 కు రామారెడ్డి మండలం నుంచి ట్రాక్టర్ లో విద్యుత్ స్తంభాలు తీసుకెళ్తున్నారు. అయితే రామారెడ్డి శివారుకు రాగానే ట్రాక్టర్ ముందు టైర్ పగిలి పోయింది.

దాంతో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ట్రాకర్ కింద పడిపోయారు. విషయం తెలిసిన గ్రామస్థులు ట్రాక్టర్ ను తీసి వారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుల కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భువనేశ్వర్ రావు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed