జమ్మూలో ఇద్దరు ఉగ్రవాదుల హతం..

by  |
జమ్మూలో ఇద్దరు ఉగ్రవాదుల హతం..
X

దిశవెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఆదివారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు . పోలీసుల వివరాల ప్రకారం.. అవంతి పురాలో ఉగ్రవాదుల కదలికలపై పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు గాలింపు చర్యలను చేపట్టాయి. కాగా భద్రతా దళాల రాకను గమనించి ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్టు పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed