- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చిత్తూరులో తుపాకులు స్వాధీనం
by srinivas |

X
దిశ, వెబ్డెస్క్: చిత్తూరు జిల్లాలో తుపాకుల కలకలం రేగింది. జిల్లాలోని మదనపల్లి మండలం తరిగొండలో మదనపల్లి రూరల్ పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బాబా ఫారుక్ అనే వ్యక్తి నుంచి రెండు తుపాకులు, 29 బుల్లెట్లను మదనపల్లి రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాకుండా ఇతనిపై ఇప్పటికే గంజాయి సప్లై కేసులు ఉన్నట్టు గుర్తించారు. ఫారుక్ స్వగ్రామం అయిన పుంగనూరు నుంచి బెంగళూరు తరలిస్తుండగా, స్థానిక సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ దిలీప్ కుమార్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు.
Next Story