- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Indian Railways: రన్నింగ్లో ట్రైన్.. నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. చివరికి ఏం జరిగిందంటే..?
దిశ వెబ్ డెస్క్: అసలే వేసవికాలం పైగా విధుల్లో ఉన్నారు, దినితో అలసిపోయారేమోగాని స్టేషన్ మాస్టర్ నిద్రలోకి జారుకున్నారు. అదే సమయంలో రైలు ఫ్లాట్ఫామ్పైకి వచ్చింది. లోకో పైలెట్ ఎన్ని సార్లు హారన్ కొట్టినా స్టేషన్ మాస్టర్ నిద్రలేవ లేదు. దీనితో రైలు అరగంట నిలిచిపోయింది. ఈ ఘటన UPలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పాట్నా-కోట మధ్య నడిచే ఓ ఎక్స్ప్రెస్ రైలు ఉడిమోర్ జంక్షన్కు చేరుకుంది. అయితే ఆ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న స్టేషన్ మాస్టర్ అప్పటికే నిద్రపోయారు. ఈ నేపథ్యంలో స్టేషన్ మాస్టర్ను నిద్రలేపేందుకు లోకోపైలట్ పలుమార్లు హారన్ కొట్టారు. అయినా స్టేషన్ మాస్టర్కు మెలుకువ రాలేదు. దీనితో రైలు అరగంట నిలిచిపోయింది.
అలా రైలు అరగంట సేపు నిలిచిపోవడంతో ఆ రైలులోని ప్రయాణికులు అసహనానికి గురైయ్యారు. కాగా విధుల్లో ఉండి నిద్రపోయిన స్టేషన్ మాస్టర్పై అధికారులు చర్యలు తీసుకున్నట్టు సమాచారం.