రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలపై కోర్టుకు వెళతాం: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్

by Shiva |
రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలపై కోర్టుకు వెళతాం: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు డిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని అన్నారు. రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌లో మంత్రులు డమ్మీలుగా మారారని ఆరోపించారు. హోంమంత్రి పర్మీషన్ లేకుండా హైదరాబాద్ నగరంలో షాపులపై ఆంక్షలు పెడతున్నారని మండిపడ్డారు. ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు తెలియకుండానే రాష్ట్రంలో సోం డిస్టీలరీస్‌కు అనుమతి ఇచ్చారని అన్నారు.

పొన్నం ప్రభాకర్‌కు తెలియకుండానే ఆర్టీసీలో ఈ టిక్కెట్ మిషన్లు కొనుగోలు చేశారని మంత్రి అంటున్నారని, టెండర్లు లేకుండా రూ.కోట్ల రూపాయల కాంట్రాక్టును కంపెనీలకు అప్పగిస్తున్నారని ప్రశ్నించారు. ఆర్టీసీ ఈ-టికెట్ కాంట్రాక్టు విషయంపై సమాచారం అడిగితే మా పరిధిలోకి రాదని ఎండీ సమాధానం చెప్తున్నారని, ఈ టిక్కెట్ మిషన్ల కాంట్రాక్టుపై పొన్నం ప్రభాకర్‌కు సంబంధం లేదని అంటున్నారు. ప్రతిరోజు 30 నుంచి 50 లక్షల టిక్కెట్ల కమీషన్ కంపెనీకి వెళ్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఫేక్ ప్రభుత్వం నడుపుతోందని, రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలపై కోర్టుకు వెళ్తామన్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో తాము ఫిర్యాదు చేస్తామని, కాంగ్రెస్ పాలనపై ఇప్పటికే బీఆర్ఎస్ బ్లాక్ బుక్, రెడ్ బుక్, గ్రీన్ బుక్స్ రెడీ చేసిందని స్పష్టం చేశారు.



Next Story