ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చూడాలి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

by Aamani |
ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చూడాలి :  కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
X

దిశ, లింగాల ఘనపురం : జనగామ పట్టణంలోని గణనాథులను మండలంలోని నెల్లుట్ల పెద్ద చెరువులో నిమజ్జనం చేయనున్నారు, దీంతో శుక్రవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ స్థలాన్ని పరిశీలించారు,ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ నిమజ్జనం కి వచ్చే భక్తుల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, నిమజ్జనం జరిగే సమయంలో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చూడాలని అన్నారు. నిమజ్జనం సమయంలో కావలసిన సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంతంగా నిమజ్జనం జరిగే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట పోలీస్, రెవెన్యూ, అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed