పోలీస్‌స్టేషన్‌లో యువకుడు ఆత్మహత్యాయత్నం..

by Aamani |
పోలీస్‌స్టేషన్‌లో యువకుడు ఆత్మహత్యాయత్నం..
X

దిశ,పాలకుర్తి/తొర్రూరు: భార్యాభర్తల,మధ్య కుటుంబ కలహాలతో,పోలీస్ స్టేషన్ మెట్లు,ఎక్కిన ఓ యువకుడు,తన కేసును పోలీసులు,పట్టించుకోవడం లేదని,పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ పోసుకుని,ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన జనగామ జిల్లా,పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకుర్తి మండలం,కొండాపురం గ్రామ శివారు, మేకల తండాకు,చెందిన లాకవత్ శ్రీను ,అదే మండలం నర్సింగాపూర్ తండాకు చెందిన,రాధికతో వివాహం అయింది. కొద్ది రోజుల నుంచి భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు రావడంతో భర్త లకావత్ శ్రీను కొన్ని రోజుల క్రితం పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు.

అయితే బాధితుడు శ్రీను, కేసు నమోదు చేసి చాలా రోజులు అవుతున్న ఏ ఒక్క పోలీస్ అధికారి నా గురించి గాని నా కుటుంబం గురించి గానీ ఆలోచించకుండా గాలికి వదిలేస్తున్నారని,దీంతో విరక్తి చెంది అదే పోలీస్ స్టేషన్ లో మద్యం మత్తులో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.ఈ ఘటనలో బాధితుడు శ్రీనును, కాపాడబోయే క్రమంలో ఎస్సై సాయి ప్రసన్న కుమార్, కానిస్టేబుల్ రవీందర్ కు గాయాలయ్యాయి. వెంటనే బాధితున్ని మెరుగైన చికిత్స కోసం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed