మోడీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ విగ్రహాలు కూల్చివేస్తాడు : కడియం శ్రీహరి

by Disha Web Desk 23 |
మోడీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ విగ్రహాలు కూల్చివేస్తాడు : కడియం శ్రీహరి
X

దిశ,లింగాల గణపురం : బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి, అంబేద్కర్ విగ్రహాలను కూల్చివేస్తాడని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని కళ్లెం, లింగాల గణపురం, నెల్లుట్ల గ్రామాలలో ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు అంబాసిడర్ గా,నిలిచిందని, రిజర్వాయర్లలో కుంభకోణం, కేసీఆర్ కూతురు కవిత, లిక్కర్ స్కాం లో 100 కోట్ల కుంభకోణం తో త్రి హర్ జైల్లో ఉంది అన్నారు, ఇలాంటి అవినీతిపరుల మధ్యలో పని చేయలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీలో చేరాను అని అన్నారు.

ప్రజా సంక్షేమం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానన్నారు. భార్యను కూడా కాపురానికి తీసుకురాలేని నరేంద్ర మోడీ మహిళలకు ఏం చేస్తాడన్నారు. నా బిడ్డ కడియం కావ్య ఎంపీ అభ్యర్థి గా నిలబడింది అని ఆమెను గెలిపించాలని అన్నారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గం ఇంచార్జ్ సింగపురం ఇందిర, మండల అధ్యక్షుడు కొల్లూరి శివకుమార్,రాష్ట్ర యువజన నాయకుడు దిలీప్ రెడ్డి,మండల ఇంచార్జ్ సదానందం,జిల్లా నాయకులు పోరెడ్డి మల్లారెడ్డి, ఎంపిటిసి మార్పు కృష్ణవేణి శ్రీనివాస్ రెడ్డి,కేమిడి బిక్షపతి,మాజీ సర్పంచ్ వీరమ్మ,చిట్ల స్వరూప రాణి భూపాల్ రెడ్డి,సాధం విజయ్ మనోహర్, గ్రామ శాఖ అధ్యక్షుడు ముమ్మడి శ్రీనివాస్,లింగాల ఘనపురం గ్రామ శాఖ అధ్యక్షుడు బి,రాజా రవీందర్ రెడ్డి,నెలూట్ల గ్రామ శాఖ అధ్యక్షుడు బత్తిని అశోక్,మండల మహిళా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి,బీమా రాజు,తదితరులు పాల్గొన్నారు.

Next Story