లేగ దూడలపై హైనా దాడి

by Sridhar Babu |
లేగ దూడలపై హైనా దాడి
X

దిశ, వర్థన్నపేట : హైనా దాడిలో లేగ దూడలు మృతి చెందిన సంఘటన అనుమకొండ జిల్లా అయినవోలు మండలం గర్నిళ్లపెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం గర్నిళ్లపెల్లి గ్రామ శివారులోని రైతుల వ్యవసాయ బావి వద్ద ఉన్న పాకలో నాలుగు రోజుల క్రితం లేగ దూడను కట్టేయగా హైనా గాయపరచడంతో మృతి చెందింది. తాజాగా శుక్రవారం గండు రాజు తన వ్యవసాయ బావి వద్ద పాకలో లేగదూడను కట్టేయగా హైనా వచ్చి దాడి చేయడంతో మృతి చెందింది. ఈ నేపథ్యంలో రైతులు పశు సంపదను కోల్పోవడంతో భయాందోళనకు గురవుతున్నారు. హైనాలు పట్టుకోవడం కోసం ప్రత్యేక బోన్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed