నెక్కొండలో ఆసుపత్రి సీజ్..

by Disha Web Desk 23 |
నెక్కొండలో ఆసుపత్రి సీజ్..
X

దిశ,నెక్కొండ: మండల కేంద్రంలో సంచలనం కలిగించిన లింగనిర్దారణ పరీక్షలు చేస్తున్న ఆస్పత్రులపై వైద్యాధికారులు తనిఖీలు నిర్వహించారు. మండలకేంద్రంలోని పార్థు నర్సింగ్ హోమ్,శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్స్ ను డిప్యూటీ డిఏం&హెచ్ఓ ప్రకాష్ రావు సీజ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ"ఆర్ఎంపీలు ప్రాథమిక చికిత్సలు మాత్రమే చేయాలని సూచించారు.అనుమతులు లేకుండా హాస్పిటల్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ ఆచార్య, నెక్కొండ మెడికల్ ఆఫీసర్ సుమంత్,పీఓ రమణాచారి,యూనిట్ ఆఫీసర్ నందా,హెల్త్ సూపర్వైజర్ యక స్వామి,హెల్త్ అసిస్టెంట్ సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed