MLA : కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

by Kalyani |
MLA : కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
X

దిశ, వర్థన్నపేట: కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా అయినవోలు మండలంలోని నందనం గ్రామంలో రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు .అనంతరం వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో పౌర్ణమి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న చేప పిల్లలను చెరువులో వదిలారు. కడారి గూడెం గ్రామంలో గత కొద్దిరోజుల అనారోగ్యంతో బాధపడుతున్న నాంపల్లి భాగ్యమను పరామర్శించి పేషెంట్ కేర్ బెడ్, వీల్ చైర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబిడి రాజిరెడ్డి, మండల అధ్యక్షులు సమ్మట మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed