కొమ్మాల జాతరకు పోటెత్తిన భక్తజనం

by Sridhar Babu |
కొమ్మాల జాతరకు పోటెత్తిన భక్తజనం
X

దిశ, గీసుగొండ : వరంగల్ జిల్లాలోనే ప్రసిద్ధి గాంచిన కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మూడవ రోజు కొనసాగుతుంది. ఆదివారం సెలవు దినం కావడంతో జాతరకు భక్తులు పోటెత్తారు. స్వామి వారిని సుమారు లక్షన్నర మంది భక్తులు ఆదివారం ఒక్కరోజే దర్శించుకోవడం విశేషం. కాగా జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రామాచార్యులు, ఫణీంద్రచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story

Most Viewed